News March 31, 2025

ఏలూరు: మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

image

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్‌రూమ్‌లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్‌పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్‌కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.

Similar News

News December 9, 2025

2,569 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ

image

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేసుకోనివారు చేసుకోవచ్చు. DEC 12వరకు ఫీజు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.35,400 చెల్లిస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 9, 2025

పార్వతీపురం: మంత్రి చుట్టూ రోజుకో వివాదం.. పూటకో రగడ

image

మంత్రి సంధ్యారాణి చుట్టూ రోజుకో వివాదం నడుస్తోంది. ఇటీవల పచ్చకామెర్లతో గురుకుల పాఠశాల విద్యార్థులు మృతి చెందడంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి PA వేధిస్తున్నాడని సాలూరుకు చెందిన మహిళ పోలీసులుకి ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. తాజాగా తన తల్లి <<18505977>>మరణానికి<<>> మంత్రి అనుచరుడి వేధింపులే కారణమని ఓ మహిళ కలెక్టర్‌కి ఫిర్యాదు చేసింది. మంత్రి అనుచరుల వల్ల ఆమెకు చెడ్డపేరు వస్తోందని లోకల్ టాక్.

News December 9, 2025

తిరుపతి: అర్చకుల మధ్య వివాదం.. అందుకోసమేనా.?

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకుల మధ్య <<18509949>>కోల్డ్‌వార్<<>> కాకరేపుతోంది. ఆలయంలో కొత్తగా నాలుగు పరిచారకుల పోస్టుల భర్తీ కానున్నాయి. వీటిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అనాధికారిక వ్యక్తులను పరిచారికులుగా చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. మరి విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.