News January 29, 2025
ఏలూరు: మార్కెట్ కమిటీ చైర్మన్ల రిజర్వేషన్లు: కలెక్టర్

ఏలూరు జిల్లాలోని మార్కెట్ కమిటీ చైర్మన్లకు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కలెక్టర్ వెట్రి సెల్వి ఖరారు చేశారు. ఇందులో భీమడోలు, ఉంగుటూరు, కైకలూరు బీసీ మహిళలు, దెందులూరు ఓసి మహిళ, చింతలపూడి కలిదిండి, ఏలూరు ఓసీ జనరల్, నూజివీడు ఎస్సీ జనరల్, పోలవరం ఎస్టీలకు నిర్ణయించినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుకూలంగా అభ్యర్థులను నిర్ణయించుకోవాలని తెలిపారు.
Similar News
News February 8, 2025
క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO

ఇంటర్లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.
News February 8, 2025
ఊరుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఊరుకొండ మండలంలోని ఇప్పపహాడ్ గ్రామానికి చెందిన సర్వేయర్ బాల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. కల్వకుర్తి పరిసర గ్రామాలలో వ్యవసాయ భూములు సర్వే చేస్తూ అందరికీ బాల్ రెడ్డి సుపరిచితుడిగా ఉన్నారు. కల్వకుర్తి నుంచి ఇప్పపహాడ్ గ్రామానికి వెళ్తుండగా.. తల తిరిగి కింద పడ్డట్లు స్థానికులు తెలిపారు.
News February 8, 2025
బాలిక ప్రసవంపై డీఎస్పీ విచారణ

భీమిలిలో చదువుతున్న అనకాపల్లి(D) చీడికాడ మండలానికి చెందిన ఓ బాలిక గర్భం దాల్చి KGHలో <<15386000>>ప్రసవించిన సంగతి విదితమే<<>>. నెలలు నిండక ముందే 6 నెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించింది. ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి చీడికాడ PSకి బదిలీ చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు చీడికాడ SI సతీశ్ చెప్పారు. పోక్సో కేసు కావడంతో ఈ కేసును DSP విచారిస్తారన్నారు.