News August 16, 2024

ఏలూరు: ముఖంపై అవాంఛిత రోమాలు.. యువతి సూసైడ్

image

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. నూజివీడు పట్టణంలోని ఓ యువతి (18) ఇంటర్ పూర్తిచేసింది. ముఖంపై అవాంఛిత రోమాలు రావడంతో వాటిని బ్లేడుతో తీసివేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఎక్కువగా రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News November 18, 2025

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.

News November 18, 2025

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.

News November 18, 2025

ఈ ఏడాదిలో 40.399 కేజీల గంజాయి సీజ్: ఎస్పీ

image

మాదకద్రవ్యాల నియంత్రణలో ఈ ఏడాది 12 కేసులు నమోదు అయ్యాయని, 55 మందిని అరెస్టు చేయగా 40.399 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దీని విలువ సుమారు రూ.3,72,680 లు ఉంటుందని, 2 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 64 కేసుల్లో సీజ్ చేసిన మొత్తం 641.544 కిలోల గంజాయిని జూలై 9న దహనం చేయడం జరిగిందన్నారు.