News March 26, 2025

ఏలూరు: ముఖ్యమంత్రి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

సచివాలయంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రత్యేక అధికారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా సమస్యలపై సీఎంతో చర్చించారు.

Similar News

News April 22, 2025

భారీ జనసమీకరణకు సన్నాహాలు

image

27న వరంగల్‌లో BRS రజతోత్సవ సభకు ఉమ్మడి NLGలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 10 – 15 వేల మందిని తరలించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. MLA జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జనసమీకరణలో బిజీ అయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక పోరుకు ముందు జరగనున్న ఈ సభ సక్సెస్ అయితే కారు పార్టీకి కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా.

News April 22, 2025

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 22, 2025

నల్గొండ: భారీ జనసమీకరణకు సన్నాహాలు

image

27న వరంగల్‌లో BRS రజతోత్సవ సభకు ఉమ్మడి NLGలోని ప్రతీ నియోజకవర్గం నుంచి 10 – 15 వేల మందిని తరలించేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు జనసమీకరణలో బిజీ అయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. స్థానిక పోరుకు ముందు జరగనున్న ఈ సభ సక్సెస్ అయితే కారు పార్టీకి కలిసొచ్చే అవకాశముందని విశ్లేషకులు అంచనా.

error: Content is protected !!