News January 3, 2025

ఏలూరు: రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకం అమలు

image

శనివారం నుంచి ఏలూరు జిల్లాలో భోజన పథకం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం’ అనే పేరుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రారంభం కాబోతున్నది. దీనికోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థులు భోజనం చేయడానికి గిన్నెలు, గ్లాసులు, వంట పదార్థాలు సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ప్రభాకరరావు చెప్పారు. నారాయణపురం కాలేజీలో ఏర్పాట్లను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు.

Similar News

News October 24, 2025

పెనుగొండ: గంజాయి కలిగి ఉన్న యువకులు అరెస్ట్

image

పెనుగొండ మండలం సిద్ధాంతం గోదావరి బ్రిడ్జ్ వద్ద గంజాయితో ఉన్న ఐదుగురు యువకులను పెనుగొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 5.630 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెనుగొండకు చెందిన సాయి నాగేంద్ర, దుర్గాసాయి, చందు, దానేశ్వరరావు, సిద్ధాంతానికి చెందిన సాయిరాంను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై గంగాధర్ తెలిపారు.

News October 24, 2025

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

image

రాష్ట్రంలో కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో శుక్రవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. నర్సాపురం-కోటిపల్లి, నర్సాపురం-మచిలీపట్నం పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. నర్సాపురం – అరుణాచలం ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ చేయాలన్నారు. నరసాపురం-వారణాసి కొత్త రైలుకు కీలక ప్రతిపాదన, వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలన్నారు.

News October 24, 2025

స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

image

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.