News March 1, 2025

ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.

Similar News

News November 2, 2025

లండన్ పర్యటనలో CM చంద్రబాబు దంపతులు

image

AP: CM చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఈనెల 5 వరకు ఈ వ్యక్తిగత పర్యటన కొనసాగనుంది. ఈనెల 4న భువనేశ్వరి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును అందుకోనున్నారు. గతంలో ఈ అవార్డును అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా అందుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ తరఫున గోల్డెన్ పీకాక్ పురస్కారాన్నీ స్వీకరించనున్నారు. అనంతరం CM చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలను CII సదస్సుకు ఆహ్వానిస్తారు.

News November 2, 2025

పాలమూరు: చెప్పుల కోసం పోతే.. ఊపిరి పోయింది!

image

ఉప్పునుంతల మండలం దాసర్లపల్లికి చెందిన మల్కేడి శంకర్‌జీ (45) ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. శనివారం ఆయన బైక్‌పై దాసర్లపల్లి నుంచి మామిళ్లపల్లికి వెళ్తుండగా, చిలుకల వాగు వంతెన దాటే క్రమంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా, తన పాదరక్షలు నీటిలో కొట్టుకుపోవడంతో, వాటిని తీసే ప్రయత్నంలో కాలు జారి పడిపోయాడు.

News November 2, 2025

NRPT: బాల రక్షణ భవనంలో డ్రైవర్ ఉద్యోగం

image

నారాయణపేట జిల్లా పరిధిలోని బాల రక్షణ భవనం వాహనం నడుపుటకు ఆసక్తి, అర్హత ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు టెన్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం సర్టిఫికెట్ తదితర పత్రాలతో ఈ నెల 7 లోపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.