News April 8, 2025
ఏలూరు: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై ఏలూరు జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులకు డిమాండ్ చేశారు.
Similar News
News November 24, 2025
GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.
News November 24, 2025
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
News November 24, 2025
ఒంగోలు: క్రికెట్ తెచ్చిన కుంపటి.. 12 మందిపై కేసు నమోదు!

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులో క్రికెట్ కారణంగా ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇరువురి ఫిర్యాదు మేరకు 12 మంది పై కేసు నమోదు చేసినట్లు ఒంగోలు తాలూకా సీఐ విజయ్ కృష్ణ తెలిపారు. ఆదివారం మంగమూరు రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న రెండు బ్యాచ్లలో విభేదాలు తలెత్తి ఒక్కసారిగా ఘర్షణ పడ్డారు. దీంతో రెండు జట్లకు చెందిన 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


