News January 24, 2025

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

image

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులు విజయవాడ నుంచి ఏలూరు వైపు బైక్‌పై వెస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్‌కు లారీ తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. క్రాంతికుమార్ తలపై నుంచి లారీ వెనక టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏలూరు జిల్లా పెదపాడు (మ)కడిమికొండ గ్రామ వాసిగా గుర్తించారు.

Similar News

News November 12, 2025

తాడేపల్లిగూడెం: గడ్డి మందు తాగి..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం (M) ఎల్. అగ్రహారంలో నివసిస్తున్న ముప్పడి కార్తీక్ (37) గడ్డి మందు తాగి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో మద్యానికి బానిసై ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి ఇంటి ముందు దొరికిన గడ్డి మందు తాగినట్లు అతని భార్య సునీత రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

ఒక్కొక్క టీమ్ రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలి: జేసీ

image

జిల్లాలో ఉండి, వీరవాసరం, నరసాపురం, యలమంచిలి మండలాల్లో ఒక్కొక్క టీం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేసేలా ఆర్డీవోలు మండల సర్వేలు తహసీల్దార్లు పర్యవేక్షించాలని జేసి రాహుల్ అన్నారు. మంగళవారం జేసి ఛాంబర్లో అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడారు. రైతులకు నోటీసులిచ్చి డాక్యుమెంట్లు పరిశీలించే సర్వే పూర్తి చేయాలన్నారు. రీ సర్వే ఫేస్ 2లో జున్నూరు, మార్టేరు గ్రామాలు రికార్డును సమర్పించాలని ఆదేశించారు.

News November 11, 2025

రేపు పీఎమ్ ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

రేపు జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహప్రవేశాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని కలెక్టర్ నాగరాణి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6,770 గృహాలకు 6,600 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న100 గృహల ప్రవేశాలు అన్ని నియోజకవర్గాల్లో రేపు నిర్వహించనున్నట్లు తెలిపారు.