News March 10, 2025
ఏలూరు: లవ్ ఫెయిల్.. యువకుడి సూసైడ్?

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చింతలవల్లి గ్రామానికి చెందిన వంశీ(25) విజయవాడలోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఓ యువతి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి గిరిపురంలో రూము తీసుకుని ఉంటున్నారు. ఇటీవల ఆ యువతి రూము నుంచి వెళ్లిపోయింది. బాధతో వంశీ ఈనెల 6వ తేదీ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందాడు.
Similar News
News March 10, 2025
షుగర్ బాధితులకు GOOD NEWS

డయాబెటిస్ రోగులకు అవసరమైన ఔషధాల భారం తగ్గనుంది. దేశీయ ఫార్మా కంపెనీలు త్వరలో Empagliflozin జనరిక్ వెర్షన్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. మార్చి 11 నుంచి ఈ డ్రగ్పై పేటెంటు ముగుస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం రూ.60గా ఉన్న ట్యాబ్లెట్ జనరిక్లో రూ.9-14కే అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం ప్రస్తుతం దేశంలో 10.1 కోట్ల మంది షుగర్ పేషంట్లు ఉన్నారు.
News March 10, 2025
MTM: ప్రజల అర్జీల పట్ల శ్రద్ధ వహించాలి- కలెక్టర్

ప్రజల నుంచి అందే అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరెట్ ప్రాంగణంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులను వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
News March 10, 2025
కడప: మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

వైవీయూ ఎమ్మెస్సీ పస్ట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ ప్రొ. ఎస్.రఘునాథరెడ్డి, కులసచివులు ప్రొ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కెఎస్వీ కృష్ణారావు, డీన్ ఎ.జి.దాముతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్సైట్ను సందర్శించాలన్నారు.