News March 10, 2025
ఏలూరు: వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు

ఏలూరు జిల్లాలో వారం రోజుల వ్యవధిలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు గురయ్యారు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై తదితర సర్వీసులకు ఏలూరు సెంటర్ పాయింట్గా ఉంది. సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే ఈ బస్సుల్లో డ్రైవర్లు ఒక్కరే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకధాటిగా గంటల తరబడి డ్రైవింగ్ చేయడం, నిద్రలేమి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News March 11, 2025
ప్రభుత్వ సలహాదారుగా దత్తాత్రేయుడు: సీఎం

AP: ప్రముఖ క్యాన్సర్ వైద్యులు <<15716479>>దత్తాత్రేయుడిని <<>>ప్రభుత్వ సలహాదారుడిగా తీసుకోనున్నట్లు CM చంద్రబాబు చెప్పారు. సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య రంగంలో ఎన్నో అవార్డులు పొందారని గుర్తుచేశారు. 50 ఏళ్లుగా క్యాన్సర్ వ్యాధికి సుదీర్ఘంగా సేవలు అందించారని వివరించారు. ఎన్నో పెద్ద యూనివర్సిటీల నుంచి చాలామంది దత్తాత్రేయుడి వద్ద వైద్యం నేర్చుకున్నారని తెలిపారు. ఆయన సలహాలతో క్యాన్సర్ నివారణ చర్యలు చేపడతామన్నారు.
News March 11, 2025
ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

TG: హైదరాబాద్లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News March 11, 2025
బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

థాయ్లాండ్లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.