News November 20, 2024
ఏలూరు: విద్యతోనే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన

బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. కలెక్టర్ ఛాంబర్లో బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనకు రూపొందించిన గోడ పత్రికను కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతోనే బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన అవుతుందన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని గుర్తు చేశారు.
Similar News
News November 23, 2025
ప.గో: వందేళ్ల వేడుకకు వేళాయె..!

ప.గో జిల్లాలో ఈ నెల 23న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో ఆమె సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 23, 2025
ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: జేసీ

అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. రెండు రోజులుగా అప్డేట్ చేయాల్సిన యాప్ను ఇప్పటికే జిల్లాలోనీ పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.
News November 23, 2025
ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి: జేసీ

అర్హులైన వారందరికీ ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరంలో అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. పాత లే అవుట్లో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించి వీఆర్వో లాగిన్లో అప్డేట్ చేయాలన్నారు. రెండు రోజులుగా అప్డేట్ చేయాల్సిన యాప్ను ఇప్పటికే జిల్లాలోనీ పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, పోడూరు మండలాలలో డేటా ఎంట్రీని మొదలుపెట్టడం జరిగిందన్నారు.


