News February 13, 2025
ఏలూరు : విద్యార్థులతో టీచర్ అసభ్య ప్రవర్తన

ఏలూరు రూరల్ మండలంలోని సత్రంపాడు జెడ్పీ హైస్కూలులో సోషల్ స్డడీస్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో వెంకటలక్ష్మి బుధవారం రాత్రి తెలిపారు. ఇటీవల గుడ్ టచ్- బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు అభయ మహిళా రక్షక బృందం అవగాహన కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు వారికి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి టీచర్ సాల్మన్ రాజును సస్పెండ్ చేస్తామన్నారు. కాగా ఆయన మరో ఏడాదిలో రిటైర్ అవ్వనున్నారు.
Similar News
News December 9, 2025
భీమవరం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయుడి సస్పెండ్

భీమవరం (M) గొల్లవానితిప్ప ZP హైస్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న సుధీర్ బాబును<<18500702>> సస్పెండ్<<>> చేస్తూ DEO నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్టర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 5న ఆయనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై సోమవారం Way2News కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
News December 9, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: ప.గో కలెక్టర్

ప.గో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.
News December 9, 2025
భూ సర్వే రోవర్లను సిద్ధం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రోవర్స్ పనితీరును మంగళవారం పరిశీలించారు. జిల్లాలో మొత్తం 114 రోవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో 42 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని రీఛార్జి చేయవలసి ఉండగా, మరికొన్ని రిపేర్లు చేయవలసినవి ఉన్నాయని సంబంధిత అధికారులు జేసీకి వివరించారు. రోవర్లకు రీఛార్జ్ చేసుకొని, రిపేర్లు ఉంటే చూసుకోవాలని జేసీ సూచించారు.


