News January 29, 2025
ఏలూరు: వేధిస్తున్నారంటూ మహిళ ఫిర్యాదు

సర్పంచ్ భర్త లైంగికంగా వేధిస్తున్నాడని చెక్కపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ జిల్లా పంచాయతీ అధికారికి మంగళవారం వినతి పత్రం అందజేసింది. జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశానని, తనపై చెడు ప్రచారం చేస్తూ తన మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది.
Similar News
News November 11, 2025
KMR: పంజా విసురుతున్న చలి

కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చలి పంజా విసురుతోంది. కామారెడ్డి జిల్లాలో నేటి ఉదయం అత్యంత తీవ్రమైన చలి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 10 నుంచి 12°C వరకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇక నుంచి ఉదయం వేళ, రాత్రి పూట చలి తీవ్రత అధికంగా ఉంటుందని చలి నుంచి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News November 11, 2025
యాదాద్రి: కోతుల సమస్యపై కార్టూన్తో ప్రభుత్వం, కోర్ట్కు విజ్ఞప్తి!

బడి, బస్సు, రైల్వేస్టేషన్, ఆటస్థలం, జనావాసాల్లో కుక్కలను కట్టడి చేయాలని రాష్ట్రాలకు సుప్రీం కోర్ట్ ఆదేశించిన విషయం తెలిదిందే. అయితే కోతుల సమస్యను ఎత్తి చూపుతూ రామన్నపేటకు చెంది కవి, టీచర్, కార్టూనిస్ట్ పాల్వంచ హరికిషన్ వేసిన కార్టూన్ ఆలోచింపజేస్తుంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కోతులు తీవ్రంగా ఉన్నాయని, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని వ్యంగ్య చిత్రంతో కోరారు. సహృదయంతో నిర్ణయం తీసుకోవాలన్నారు.
News November 11, 2025
ఇతరులు మనల్ని బాధ పెట్టకూడదంటే?

త్రివిధ తాపాల్లో రెండవది ఆది భౌతిక తాపం. ఇవి మన చుట్టూ ఉన్న ఇతర జీవుల వలన కలుగుతుంది. శత్రువులు, దొంగలు, జంతువులు, కీటకాల నుంచి మనకు కలిగే బాధలు ఈ కోవకు చెందుతాయి. వీటి నుంచి విముక్తి పొందే మార్గాలను వేదాలు చెబుతున్నాయి. ప్రేమ, కరుణ, జీవుల పట్ల సమభావం ఉండాలి. అహింసా సిద్ధాంతాన్ని ఆచరించడం, పరుల పట్ల శత్రుత్వాన్ని విడిచిపెట్టడం, అందరితో సామరస్యంగా జీవించడం ద్వారా ఈ బాహ్య దుఃఖాలను తగ్గించుకోవచ్చు.


