News March 20, 2025
ఏలూరు: వైసీపీకి కార్పొరేటర్ రాజీనామా

ఏలూరు 7వ డివిజన్ కార్పొరేటర్ పిల్లంగోళ్ల శ్రీదేవి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత జగన్కు పంపినట్లు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల తన సోదరి, రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శ్రీలక్ష్మిని ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త అవమానించారని అన్నారు. ఆమెపై అసత్య ప్రచారాలు చేసి సస్పెండ్ చేయడం తనను ఎంతో బాధించిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Similar News
News March 28, 2025
నేషనల్ సైకిలింగ్ పోటీలకు సిద్దిపేట విద్యార్థి

9వ జాతీయస్థాయి మౌంటెన్ బైక్ సైక్లింగ్ పోటీలకు సిద్ధిపేటకు చెందిన బూక్య ప్రసాద్ ఎంపికైనట్లు జిల్లా సైకిల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కార్యదర్శులు బండారుపల్లి శ్రీనివాసులు, జంగపల్లి వెంకట నర్సయ్య తెలిపారు. ఈనెల 7,8,9న రంగారెడ్ది జిల్లాలో జరిగిన పోటిల్లో సత్తా చాటిన ప్రసాద్.. హరియాణాలోని పంచకులలో ఈనెల 29 నుంచి నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.
News March 28, 2025
భద్రాచలంకు రూ.35 కోట్లు.. సీఎంకు ఎమ్మెల్యేల కృతజ్ఞతలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
News March 28, 2025
రాష్ట్ర స్థాయి కబడ్డీ జట్టుకు వికారాబాద్ వాసి

సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు గోపి ఎంపిక కావడం ఎంతో అభినందనీయమని వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నేనావత్ పరశురాం నాయక్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 27, 30 తేదీలలో బిహార్ రాష్ట్రంలో నిర్వహించనున్న 34వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు గోపి ఎంపిక కావడంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు.