News March 15, 2025
ఏలూరు: శనివారం నుంచి ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఒంటి పూట బడులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి మహాలక్ష్మమ్మ తెలిపారు. ఈ ఆదేశాలను డివైఈవోలు, ఎంఈవోలు అన్ని పాఠశాలల్లో పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు.
Similar News
News November 20, 2025
HYD: రాజమౌళిపై PSలో ఫిర్యాదు

HYD రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో మహేశ్ బాబు నటించిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడిపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కె.శివ కుమార్ అన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ PSలో ఫిర్యాదు చేశారు.
News November 20, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది సాయికుమార్

వరంగల్ భద్రకాళి అమ్మవారిని గురువారం ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శేషు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త వీరన్న, అధికారులు క్రాంతి కుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.


