News March 20, 2025

ఏలూరు: సత్తా చాటిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ విద్యార్థులు

image

ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజి విద్యార్థులు 2024 సంవత్సరానికి జరిగిన యంబీబీయస్ పరీక్షా ఫలితాలలో అఖండ విజయాన్ని నమోదు చేశారు. 257 మంది విద్యార్ధులు పాల్గొన్న ఈ పరీక్షలలో 238 విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఆశ్రం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా.చేబ్రోలు శ్రీనివాస్ తెలిపారు. ఫైనల్ యం.బి.బి.యస్ పార్ట్-1 లో 100% శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, పార్ట్-2లో 92% శాతం ఉత్తీర్ణత నమోదు చేశారన్నారు.

Similar News

News October 26, 2025

ఎంజీఎం సూపరింటెండెంట్‌పై వేటు

image

ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ఘటనలు,<<18099653>> ‘ఔరా ఇదేం వైద్యం.. ఎంజీఎంలో ఇద్దరికీ ఒకే సిలిండర్!’ <<>>అని Way2Newsలో శనివారం మధ్యాహ్నం ప్రచురితమైన కథనంపై మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌పై వేటు వేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, ప్రతి వారం ఆసుపత్రిపై సమీక్షించి నివేదిక ఇవ్వాలని డీఎంఈ నరేంద్ర కుమార్‌కు సూచించారు.

News October 26, 2025

ANU రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.B.A, PG రీవాల్యుయేషన్ ఫలితాలను శనివారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.B.A 4-సెమిస్టర్, M.SC 3-సెమిస్టర్ ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, M.SC 1-సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్& టెక్నాలజీ సబ్జెక్టుల రీవాల్యుయేషన్ ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలన్నారు.

News October 26, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.