News October 19, 2024
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో మృతదేహాల దొంగ

ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. పగలు డ్యూటీ చేసే వ్యక్తి అక్టోబర్ 8న రాత్రి అనాథ శవాన్ని అంబులెన్స్లో పంపేశాడు. డ్యూటీలో ఉన్న లేడీ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్ శశిధర్, ఆసుపత్రి పర్యవేక్షకుడికి ఫిర్యాదు చేశారు. అయితే అనాథ శవాలను కళాశాలలకు అమ్మేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Similar News
News February 25, 2026
కాళ్ల: కలెక్టర్ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు. రైతుల సంక్షేమం కోసం వినూత్న ప్రయోగాలు చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు.
News February 25, 2026
ప.గో: ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ

ప.గో జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఈ నెల 28నే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. మార్చి 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పంపిణీకి ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. జిల్లాలోని 2,22,982 మంది లబ్ధిదారులకు రూ. 96.39 కోట్లను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. శనివారం ఉదయమే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
News February 25, 2026
నరసాపురం: వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

నరసాపురం మండలం వేములదీవి పడమరలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు(53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే నరసాపురం తహశీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.


