News August 17, 2024

ఏలూరు: సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర

image

భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1 నుంచి 10 వరకు పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో పూరీ- కాశీ- అయోధ్య యాత్రను నిర్వహిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ఏరియా మేనేజర్‌ రాజా తెలిపారు. ఈ యాత్రలో పూరీ, కోణార్క్‌, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌ రాజ్‌ పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. వచ్చే నెల 1న సికింద్రాబాద్‌లో యాత్ర రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, స్టేషన్లో ఆగుతుందన్నారు.

Similar News

News December 5, 2025

ప.గోలో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరందించేలా ప్రాజెక్ట్

image

జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.1,400 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం తెలిపారు. 16 మండలాల పరిధిలోని 862 గ్రామాల్లోని 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. దీని కోసం 2,662 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.

News December 5, 2025

నేడు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: DEO

image

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల శుక్రవారం ‘మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్’కు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు DEO నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలలను చక్కగా ముస్తాబు చేశారు. మామిడి ఆకులు, అరిటి మొక్కలతో స్కూళ్లను సుందరంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థుల, తల్లితండ్రులకు సమాచారం అందించారు.