News November 19, 2024

ఏలూరు: ‘సైబర్ నేరాలపై అవగాహన అవసరం’

image

ప్రస్తుతం సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నెంబరు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు. వెబ్ సైట్ www.cybercrime.gov.in సందర్శించవచ్చన్నారు.

Similar News

News July 8, 2025

తాడేపల్లిగూడెం: మద్యం తక్కువ పోశాడని హత్య

image

తాడేపల్లిగూడెం పాత రేలంగి చిత్ర మందిర్ సమీపంలో రెడ్డి గోవింద్ హత్య కేసులో నిందితుడైన గుబ్బల మల్లేశ్వరరావు (53)ను సోమవారం నరసింహారావుపేటలోని అతని ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మద్యం తక్కువ పోశాడని ప్రశ్నించడంతో నిందితుడు మల్లేశ్వరరావు రాయితో గోవింద్ తలపై కొట్టి పారిపోయినట్లు విచారణలో తేలిందని సీఐ వివరించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News July 8, 2025

మెగా పేరెంట్స్ మీట్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

జిల్లాలో మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్ ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 1,920 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,79,204 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే 121 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 37,124 మంది విద్యార్థుల తల్లిదండ్రులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు.

News July 8, 2025

ప.గో: 1,612 సెల్‌ఫోన్‌ల రికవరీ: ఎస్పీ

image

ప.గో జిల్లావ్యాప్తంగా వివిధ విడతల్లో ఇప్పటివరకు సుమారు రూ.2.40 కోట్ల విలువైన మొత్తం 1,612 సెల్‌ఫోన్‌లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పదవ విడతలో భాగంగా సుమారు రూ.31 లక్షల విలువైన 208 మొబైల్ ఫోన్‌లను బాధితులకు తిరిగి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.