News March 27, 2025

ఏలూరు: సోషల్ పరీక్ష పై క్లారిటీ ఇచ్చిన డీఈవో

image

ఏలూరు జిల్లాలో నిర్వహించవలసిన సాంఘిక శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్ష పై పలు అపోహలు విడాలని డీఈవో వెంకట లక్ష్మమ్మ గురువారం అన్నారు. డీఈవో మాట్లాడుతూ.. రంజాన్ సెలవు మార్చి 31న ప్రభుత్వం ప్రకటిస్తే.. ఏప్రిల్ ఒకటిన షోషల్ పరీక్ష ఉంటుందన్నారు. ఒకవేళ ఏప్రిల్ 1న రంజాన్ సెలవు ప్రకటిస్తే.. మార్చి 31న సోషల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కావున విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

Similar News

News January 7, 2026

పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

image

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్‌ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.

News January 7, 2026

టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

image

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.

News January 7, 2026

‘ఏప్రిల్‌లో వరంగల్ 24 అంతస్తుల ఆసుపత్రి ప్రారంభం’

image

వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా రూ.1100 కోట్లతో నిర్మించిన 24 అంతస్తుల ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ఏప్రిల్‌లో ప్రారంభించనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మార్చిలోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరంగల్‌ను హెల్త్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.