News February 28, 2025

ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.

Similar News

News November 9, 2025

SFIOలో 36 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(<>SFIO<<>>)36 డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ ప్రాసిక్యూటర్, సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్, తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, LLB, CA, MA, M.COM, MBA/PGDM ఉత్తీర్ణులు అర్హులు. వెబ్‌సైట్: https://sfio.gov.in

News November 9, 2025

ADB: రూ.1.37 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

image

డ్రైవర్ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.37 లక్షలు కాజేసిన ఘటన ADBలో జరిగింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాలు.. క్రేన్ డ్రైవర్ గోల్వే సతీష్‌కు గుర్తుతెలియని వ్యక్తి మాట్లాడుతూ.. తమ దగ్గ లీటర్ల డిజిల్ ఉందని సగం ధరకే ఇస్తామని నమ్మించగా బాధితుడు నగదును ఫోన్పే ద్వారా చెల్లించాడు. సైబర్ నేరగాడు ఒక పెట్రోల్ పంపు చిరునామా చెప్పి డిజిల్ ఇస్తారని తెలుపగా.. బాధితుడు ఆ డీజిల్ పంపుకు వెళ్ళగా మోస పోయినట్లు గ్రహించాడు.

News November 9, 2025

రేపు భద్రాచలం, కొత్తగూడెంలో ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

image

ప్రజల సౌకర్యార్థం సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వస్తున్నందున, వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర సమస్యలపై కలెక్టరేట్ ఇన్‌వార్డ్‌లో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.