News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News November 12, 2025
ఆస్పత్రిలో చేరిన మరో సీనియర్ నటుడు

బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద(61) ముంబై క్రిటికేర్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న దిగ్గజ నటుడు ధర్మేంద్రను నిన్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన గోవింద ఇంట్లో రాత్రి సమయంలో కుప్పకూలిపోయారు. దీంతో అర్ధరాత్రి ఒంటిగంటకు ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ తెలిపారు. ఆయనకు పలు టెస్టులు చేశారని, వాటి రిజల్ట్స్ వస్తే అనారోగ్యానికి కారణం తెలుస్తుందన్నారు.
News November 12, 2025
జూబ్లీ వార్.. ఆయనదే గెలుపు.. కాదు కాదు ఆమెదే

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బెట్టింగ్ రాయుళ్లకు పండుగలా మారింది. గెలుపోటములపై ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. దీనిపై రూ. వేల నుంచి రూ. లక్షల్లో బెట్టింగ్ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ యాప్లలో, మరి కొందరు వాట్సాప్ గ్రూపుల్లో పందేల వివరాలపై చాటింగ్ జరుపుతున్నట్లు టాక్. ఎన్నిక ఫలితం వెలువడే నాటికి రూ.లక్షల్లో చేతులు మారే అవకాశముందని సమాచారం. ఈ ఉపఎన్నిక ఫలితం 14న వెలువడనుంది.
News November 12, 2025
వేములవాడ: శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభం

వేములవాడ రాజన్న ఆలయ ఆవరణలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ప్రచార రథంలో శ్రీ స్వామివారి ఉత్సవా విగ్రహాలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసి, పక్కనే ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. గత నెల 20వ తేదీన శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి స్వామి దీనిని ప్రారంభించారు.


