News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News November 5, 2025
యాలాల్: ‘అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది’

రోడ్డు ప్రమాదంలో మరణించిన యాలాల్ మండలానికి చెందిన పలు కుటుంబాలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. పేర్కంపల్లి గ్రామానికి చెందిన సాయిప్రియ, నందిని, తనూష కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల చొప్పున ముగ్గురికి మొత్తం రూ.21 లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన గుర్రాల అఖిల రెడ్డి కుటుంబానికి రూ.7లక్షల చెక్కును అందజేశారు.
News November 5, 2025
ఒక్క సేఫ్టీ పిన్ ధర రూ.69వేలు!

వివిధ అవసరాలకు వాడే సేఫ్టీ పిన్ (పిన్నీసు/ కాంట) ఊర్లో జరిగే సంతలో, దుకాణాల్లో రూ.5కే డజను లభిస్తాయి. అయితే వాటికి దారాలు చుట్టి భారీ ధరకు అమ్మేస్తోంది లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ‘ప్రడా’ (Prada). చిన్న మెటల్ సేఫ్టీ పిన్ బ్రోచ్ ధర 775 డాలర్లు (సుమారు రూ. 69,114) ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అతి సాధారణ వస్తువులనూ బ్రాండింగ్ చేస్తూ సంపన్నులను ఆకర్షిస్తున్నాయి ఈ కంపెనీలు. దీనిపై మీరేమంటారు?
News November 5, 2025
పోలీస్ స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలి: VZM SP

పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్పీ దామోదర్ కోరారు. విజయనగరం ఎస్పీ కార్యాలయం నుంచి బుధవారం రీసెప్షనిస్టలుగా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. వివిధ సమస్యలపై స్టేషన్కు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదు రాయడం రానివారికి సిబ్బందే సాయం చేయాలని ఆదేశించారు.


