News February 28, 2025
ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.
Similar News
News November 14, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 14, 2025
వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.
News November 14, 2025
అన్నమయ్య: బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండ్యం, కేశాపురంలో ఓ బైక్, ఫారెస్ట్ చెక్పోస్టును ఢీ కొట్టింది. దానిని వెనుకే వస్తున్న బెంగళూరు-పొరుమామిళ్ల ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై మదనపల్లె సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు విచారిస్తున్నారు.


