News February 28, 2025

ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.

Similar News

News November 13, 2025

అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు రంపచోడవరం విద్యార్థి

image

రంపచోడవరం డిగ్రీ కళాశాల విద్యార్థులు నన్నయ యూనివర్శిటీ నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు గెలుపొందినట్లు ప్రిన్సిపల్ డాకే వసుధ తెలిపారు. బెంగళూరులో నిర్వహించే అల్ ఇండియా అథ్లెటిక్స్ పోటీలకు జి. ప్రవీణ్ సెలెక్టైనట్లు వివరించారు. పతకాలు సాధించిన విద్యార్థులకు వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, పీడీ ప్రభాకర్ రావు, అధ్యాపకులు అభినందించారు.

News November 13, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 13, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 13, 2025

పాకిస్థాన్‌తో సిరీస్ కొనసాగుతుంది: శ్రీలంక

image

ఇస్లామాబాద్‌లో పేలుడు నేపథ్యంలో పలువురు శ్రీలంక ప్లేయర్లు పాకిస్థాన్ వీడుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్లేయర్లు, సిబ్బందికి తగిన భద్రతను పాక్ కల్పిస్తుందని స్పష్టం చేసింది. ఎవరైనా జట్టును వీడితే వారి స్థానంలో ఇతర ప్లేయర్లను రీప్లేస్ చేస్తామని పేర్కొంది. ఇవాళ పాక్-శ్రీలంక మధ్య రెండో వన్డే జరగనుంది.