News February 28, 2025

ఏలూరు: స్ట్రాంగ్ రూముల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల రూపంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఆరు జిల్లాల నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లను ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలకు తీసుకువచ్చారు. బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3వ తేదీన లెక్కింపు కార్యక్రమం జరగనుంది.

Similar News

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 14, 2025

వేములవాడ రాజన్న దర్శనాలు.. UPDATE

image

వేములవాడ రాజన్న ఆలయంలో రెండు రోజుల క్రితం నుంచి దర్శనాలను నిలిపివేసిన అధికారులు భక్తులు ప్రవేశించకుండా ముందు భాగంలోని స్వాగత ద్వారం వద్ద రేకులను అమర్చిన విషయం తెలిసిందే. తాజాగా గేటు బయట నుంచి సైతం మరింత ఎత్తుగా అదనంగా రేకులను ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో గేటు ముందు రెండంచెల భద్రత తరహాలో ఇనుప రేకులను ఫిక్స్ చేశారు.

News November 14, 2025

అన్నమయ్య: బస్సు ప్రమాదంపై ఫారెస్ట్ అధికారుల విచారణ

image

అన్నమయ్య జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదానికి గురికావడం తెలిసిందే. బెంగళూరు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న వినాయక ట్రావెల్ బస్సు చిన్నమండ్యం, కేశాపురంలో ఓ బైక్, ఫారెస్ట్ చెక్‌పోస్టును ఢీ కొట్టింది. దానిని వెనుకే వస్తున్న బెంగళూరు-పొరుమామిళ్ల ట్రావెల్స్ బస్ ఢీకొట్టింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనపై మదనపల్లె సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు విచారిస్తున్నారు.