News February 13, 2026
ఏలూరు: హత్య కేసులో జీవిత ఖైదు

దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితుడు పాలడుగుల దుర్గాప్రసాద్కు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. 2022లో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్లు దెందులూరు ఎస్సై శివాజీ వెల్లడించారు.
Similar News
News March 15, 2026
తిరుమలలో అన్నమయ్య 523వ వర్ధంతి మహోత్సవం

తిరుమల లేపాక్షి కూడలిలో ఉన్న తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం వద్ద ఆదివారం ఆయన 523వ వర్ధంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో అన్నమయ్య 12వ తరానికి చెందిన తాళ్లపాక వంశీకులు రాఘవ, పవన్ భరద్వాజ్, హైగ్రీవ నారాయణాచార్యులు, కంచి రాజేష్ ప్రేమ్ కుమార్, బెంగళూరుకు చెందిన విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News March 15, 2026
పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2,500.. త్వరలో కీలక ప్రకటన!

TG: ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో పెండింగ్లో ఉన్నవాటి అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్ రూ.4,000కు పెంపు హామీలపై రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇక కొత్త సంక్షేమ పథకాలు, నీటిపారుదల, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి అంశాలపైనా కీలక నిర్ణయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
News March 15, 2026
FLASH.. జమ్మికుంటలో రైలు పట్టాలపై తెగిపడిన తల

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.


