News January 28, 2025
ఏలూరు: హెల్మెట్ లేకే ప్రాణాలు పోతున్నాయి..!

ఏలూరు పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలకు గురైన వారిలో సగం మందికి హెల్మెట్ లేకపోవడంతో చనిపోతున్నారని గుర్తు చేశారు. అందరూ హెల్మెట్ వాడాలని సూచించారు.
Similar News
News October 28, 2025
రూ.765 కోట్లతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ

AP: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద రాష్ట్రంలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. దీంతో దాదాపు 955 మందికి ఉపాధి లభించనుంది. 3 రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడులతో 7 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీ, 5,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News October 28, 2025
వనపర్తి: మద్యం దుకాణాల లక్కీడిప్.. కొత్తవారిని వరించిన అదృష్టం

జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు కోసం కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో లక్కీడిప్ నిర్వహించారు. DEC నుంచి ప్రారంభమయ్యే కొత్త పాలసీలో మొత్తం 36 దుకాణాలను కేటాయించగా, అగ్రభాగం కొత్తవారినే వరించింది. జిల్లా కేంద్రంలోని 6 దుకాణాలకుగాను 4 కొత్త వారికి దక్కాయి. 40కి పైగా దరఖాస్తులు వేసిన పాత సిండికేట్లకు నిరాశ ఎదురైంది. కొత్తకోట, పానగల్, పెబ్బేరులోనూ కొత్తవారికే దుకాణాలు లభించాయి.
News October 28, 2025
జీవితమంతా యోగసాధనలోనే..

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ మరిన్ని స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీ.


