News January 28, 2025
ఏలూరు: హెల్మెట్ లేకే ప్రాణాలు పోతున్నాయి..!

ఏలూరు పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. స్థానిక పోలీస్ పెట్రోల్ బంక్ నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలకు గురైన వారిలో సగం మందికి హెల్మెట్ లేకపోవడంతో చనిపోతున్నారని గుర్తు చేశారు. అందరూ హెల్మెట్ వాడాలని సూచించారు.
Similar News
News November 23, 2025
KNR: సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్లో ఉచిత శిక్షణ

క్రాష్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు నిరుద్యోగ క్రైస్తవ మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టి సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ టెక్నిషియన్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తుతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లును DEC 10 లోపు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలి.
News November 23, 2025
న్యూస్ అప్డేట్స్

⋆ నేడు పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న AP CM చంద్రబాబు, తెలంగాణ CM రేవంత్
⋆ నేడు రాప్తాడుకు YCP అధినేత జగన్.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరు
⋆ HYDలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు.. సీతాఫల్మండి నుంచి చిలకలగూడ వరకు యూనిటీ మార్చ్లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. రాంచందర్ రావు
News November 23, 2025
జీఎన్ఎం శిక్షణ దరఖాస్తు గడువు పొడిగింపు

నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలు ఆన్లైన్ వెబ్ సైట్ dme.tealngana.gov.inలో చూసుకోవచ్చని సూచించారు.


