News October 20, 2024
ఏలూరు: హైకోర్టు జడ్జిని కలిసిన కలెక్టర్ వెట్రి సెల్వి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సురేశ్ రెడ్డి ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం పలు జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
Similar News
News October 21, 2024
ఏలూరు: CM ఫొటో మార్ఫింగ్.. ఒకరిపై కేసు
సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యంగా మార్చిన ఓ వ్యక్తిపై ఏలూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. లింగపాలెం మండలం బోగోలుకు చెందిన సాతునూరు లక్ష్మీనవదీప్ సీఎం చంద్రబాబు ఫొటోను అసభ్యకరంగా మార్చాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదే విషయమై కె.యోహాన్ అనే వ్యక్తి లక్ష్మీనవదీప్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగపాలెం ఎస్ఐ వెంకన్న కేసు నమోదు చేశారు.
News October 21, 2024
చింతమనేనికి బెదిరింపు.. బోరుగడ్డపై కేసు
వైసీపీ మద్దతుదారుడు బోరుగడ్డ అనిల్ కుమార్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై ఏలూరులోనూ కేసు నమోదైంది. దెందలూరు MLA చింతమనేని ప్రభాకర్కు 2023లో బోరుగడ్డ ఫోన్ చేశారు. ‘మా పార్టీ తలచుకుంటే నీ అంతు చూస్తుంది. మీ సామాజికవర్గాన్ని ఖతం చేస్తాం’ అని బెదిరించారు. ఈక్రమంలో చింతమనేని ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో నిన్న రాత్రి కేసు నమోదు చేశారు.
News October 20, 2024
ప.గో జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఖరారు
ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ను ఖరారు చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం సందిగ్ధత నెలకొంది. దీంతో నేడు విడుదల చేసిన ప్రకటనతో ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది.