News July 16, 2024
ఏలూరు: 16 ఏళ్ల మైనర్పై అత్యాచారం

ఏలూరు జిల్లాలో ఓ మైనర్పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు..టి.నరసాపురం మండలానికి చెందిన ఓ బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఓసారి ఆమె ఇంటికి వచ్చినపుడు గ్రామానికి చెందిన తాడి నాగకుమార్ అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ నెల 6న బెదిరించి గ్రామశివారుకు పిలిపించి బలవంతంగా మరోముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్లో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై కేసునమోదైంది.
Similar News
News October 21, 2025
పేరుపాలెం బీచ్ సందర్శకులకు అనుమతి లేదు: ఎస్ఐ

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున బుధవారం పేరుపాలెం బీచ్లోకి సందర్శకులను అనుమతించడం లేదని మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
News October 21, 2025
తణుకు: ఇరు వర్గాల ఘర్షణ.. ఏడుగురికి గాయాలు

తణుకు మండలం తేతలిలో సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఏడుగురు గాయపడ్డారు. వివాదం తీవ్రమై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్ఐ కె. చంద్రశేఖర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 20, 2025
భీమవరం: ఈనెల 23న ఎంపీడీఓ కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్

AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 23న భీమవరం MPDO కార్యాలయంలో ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 18-35 సంవత్సరాల నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి పి.లోకమాన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని, వివరాలకు 86885 94244 ఈ నంబర్కు సంప్రదించాలన్నారు.