News February 2, 2025
ఏలూరు: 2,46,924 మందికి పెన్షన్ పంపిణీ.. కలెక్టర్

ఏలూరు జిల్లాలో శనివారం రాత్రి 7 గంటల వరకు 2,46,924 మంది పెన్షన్ అర్హులకు రూ.106.55 కోట్లు అందజేశామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంకా 14,530 మందికి పింఛను అందజేయాల్సి ఉందన్నారు. మిగిలిన వారికి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం లోగా పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. గమనించాలని సూచించారు.
Similar News
News February 19, 2025
శుభ ముహూర్తం (బుధవారం, 19-02-2025)

తిథి: బహుళ సప్తమి
నక్షత్రం: విశాఖ ఉ.8.11 నుంచి
శుభసమయం: ఉ.9.04 నుంచి 9.28 వరకు
రాహుకాలం: మ.12.00 నుంచి మ.1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36- మ.12.24
వర్జ్యం: మ.2.25 నుంచి మ.4.11 వరకు
అమృత ఘడియలు: రా.12.58 నుంచి రా.2.44 వరకు
News February 19, 2025
వికారాబాద్: అభివృద్ధి లక్ష్యంగా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్

నాబార్డ్ ద్వారా పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ద్వారా జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో 2025-26 నాబార్డ్ పొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్ను ఆవిష్కరించారు. ప్రాధాన్యతా విభాగంలో అందుబాటులో ఉన్న భౌతిక ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
News February 19, 2025
గోదావరిఖని: ‘భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే..!’

భవిష్యత్ ఆ అరుదైన ఖనిజాలదే అని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. భారతదేశాన్ని 2047 నాటికి అగ్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని, ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.