News March 24, 2025
ఏలూరు: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.56 లక్షల మంది ఇంకా EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.
Similar News
News November 21, 2025
సంక్షేమ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి: MNCL కలెక్టర్

వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్ ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. వయోవృద్ధుల దరఖాస్తులను పోలీసు, రెవెన్యూ సిబ్బంది సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు.
News November 21, 2025
MNCL:ఈనెల 23న జూనియర్ వాలీబాల్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల23న ఉమ్మడి జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల వాలీబాల్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు నల్ల శంకర్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఆదిలాబాద్లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఉదయం 9గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈపోటీల్లో ఎంపికైనవారు సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
News November 21, 2025
దేవరకొండ ASP మౌనిక ఆదిలాబాద్కు బదిలీ

దేవరకొండ ఏఎస్పీ మౌనిక బదిలీ అయ్యారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందిన ఆమె ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయిన వారిలో ఆమె ఒకరు. ఏఎస్పీగా ఇక్కడ సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.


