News March 24, 2025

ఏలూరు: EKYC ఎక్కడ చేస్తారంటే..?

image

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 1.56 లక్షల మంది ఇంకా EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.

Similar News

News November 25, 2025

GOOD NEWS.. HYDకు రూ.300 కోట్లు

image

GHMCకి ప్రభుత్వం శుభవార్త చెప్పంది. 150 డివిజన్‌లకు రూ.300 కోట్లు ప్రకటించినట్లు మేయర్ విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో GHMC ఎలక్షన్స్ రానున్నాయని, ఈ లోపు పెండింగ్ అభివృద్ధి పనులు పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. మొదట సీఎం 150 డివిజన్లకు రూ.కోటి చొప్పున విడుదల చేస్తామన్నారన్నారు. అవి సరిపోవని చెప్పడంతో మరో రూ.150కోట్లు కేటాయించారని స్పష్టంచేశారు.

News November 25, 2025

వరంగల్: అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే..?

image

WGL(D) సంగెం(M) ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోయినా 2011 లెక్కల్లో పొరపాటుతో సర్పంచ్ స్థానం SC మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఒక్క SCగా 60ఏళ్ల కొంగర మల్లమ్మ ఉండటంతో ఆమెకే జాక్‌పాట్. మొత్తం 1,647 ఓట్లున్న ఈ గ్రామంలో ఇప్పుడు మల్లమ్మ ప్రజెంట్ ఫేవరెట్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా ఆమెను సంప్రదిస్తున్నాయట. ప్రేమవివాహం చేసుకున్న BC-SC దంపతులపైనా పార్టీల దృష్టి పడినట్లు సమాచారం.

News November 25, 2025

అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

image

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.