News July 8, 2024

ఏలూరు: UPDATE.. మృతులు HYDవాసులు

image

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి పరిధిలోని రాజవోలు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు. కారు డ్రైవర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన దుర్గా వంశీగా గుర్తించారు.

Similar News

News November 18, 2025

ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

image

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

ప.గో. జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా కందుల భాను ప్రసాద్

image

పశ్చిమగోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా భీమవరం పట్టణానికి చెందిన కందుల భాను ప్రసాద్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేశ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళ్రావు చేతుల మీదుగా మంగళవారం ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

News November 18, 2025

భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

image

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.