News October 9, 2024
ఏసీఏ టోర్నీలో విశాఖ జట్టు విజయం
ఏసీఏ అండర్ -14 క్రికెట్ టోర్నీలో విశాఖ జట్టు గెలుపొందింది. కడపలో జరిగిన మ్యాచ్లో తూ.గో. జిల్లా జట్టుపై విశాఖ ఘన విజయం సాధించింది. విశాఖ 68 ఓవర్లలో 426/3కి డిక్లేర్ చేయగా.. తూ.గో. జట్టు 50పరుగులకే ఆలౌట్ అయింది. విశాఖ జట్టులో వినోద్ (177), రామ్ చరణ్(133)రన్స్ చేయగా.. ప్రఖ్యాత్ వర్మ 5వికెట్లు తీశారు.
Similar News
News October 9, 2024
విశాఖ: ఒక్కరే 30మద్యం దుకాణాలకు దరఖాస్తు
విశాఖ జిల్లాలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తూ.. ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ మద్యం వ్యాపారి ఏకంగా 30దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కొందరు సిండికేట్గా ఏర్పడి దరఖాస్తులు ఎక్కువగా రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 9, 2024
నేడు మన నితీశ్ కుమార్ రెడ్డి సిక్సర్లతో చెలరేగుతారా..!
ఇండియా- బంగ్లాదేశ్ మధ్య బుధవారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొన్న జరిగిన తన అరంగేట్ర టీ20లో మన విశాఖ ప్లేయర్ నితీశ్ రెడ్డి బౌలింగ్, బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. రెండు ఓవర్లు బౌలింగ్ వేయడంతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఓ భారీ సిక్సర్తో 16 రన్స్ చేశాడు. నేడు బంగ్లాతో రెండో టీ20లో సిక్సర్లతో చెలరేగడంతో పాటు ఆల్రౌండ్ ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News October 9, 2024
విశాఖలో పెరిగిన విమాన ప్రయాణికులు
విశాఖ ఎయిర్పోర్టు నుంచి ప్రయాణించే విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జులైలో 1,720 విమానాల ద్వారా 2,25,261 మంది.. ఆగస్టులో 1,872 విమానాల్లో 2,52,311 మంది ప్రయాణించినట్లు ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. సెప్టెంబరులో 1,806 సర్వీసుల్లో 2,25,215మంది ప్రయాణించినట్లు వివరించింది. మొత్తంగా గతేడాదితో పోలిస్తే 6.8శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.