News August 6, 2024

ఏసీఏ పీఠం కోసం జేసీ పవన్ రెడ్డి ప్రయత్నం?

image

టీడీపీ నేత జేసీ పవన్‌రెడ్డి ఏసీఏ (ఆంధ్ర క్రికెట్‌ సంఘం) పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో చోటు సాధించాలని పవన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏసీఏలో అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు తెలిసింది. అయితే జిల్లా అసోసియేషన్‌లన్నీ ఎంపీ కేశినేని చిన్నీని ఏసీఏ ఛైర్మన్‌గా కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు SEP 8న ACA నూతన కార్యవర్గం ఎన్నిక జరగనుంది.

Similar News

News October 27, 2025

అనంతపురంలో దారుణం.. బాలుడిని చంపిన వ్యక్తి

image

అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అరుణోదయ కాలనీలో సుశాంత్(5) అనే బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చినట్లు సమాచారం. అయితే ఆదివారం తమ బాలుడు కనిపించడం లేదని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 27, 2025

రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్‌లో సత్తాచాటిన క్రీడాకారులు

image

కర్నూలులో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో జిల్లా క్రీడాకారులు రాణించారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ.. సంతోష్‌కు అండర్-6లో 4వ స్థానం, వెనీషా‌కు బాలికల -12లో 4వ స్థానం, నితీష్‌కు -14లో 5వ స్థానం, జనని ఎఫ్-10లో 8వ స్థానం సాధించారన్నారు. విజేతలకు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ కామిశెట్టి బహుమతులు అందించారు.

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.