News March 6, 2025

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్

image

ఏసీబీ వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చిక్కుకున్నారు. ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ధర్మపురిలో ఎప్పటి నుంచో ఈ అవినీతి జరుగుతుందనే ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి.

Similar News

News November 24, 2025

సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

image

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

News November 24, 2025

Free movies, Free downloads ప్రమాదకరం: సజ్జనార్

image

అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్‌ను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతారని పేర్కొన్నారు. ‘Free movies, Free downloads అంటూ ఉచితమనిపించే కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకోండి’అని సూచించారు.

News November 24, 2025

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

image

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.