News January 29, 2025
ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్సై

లింగంపేట్ ఎస్సై సుధాకర్ ఏసీబీకి చిక్కారు. వాహనాల అమ్మకాలు, కొనుగోలు చేసే ఓ వ్యాపారి నుంచి వాహనానికి రూ.12 వేల చొప్పున లంచం ఎస్ఐ లంచం అడిగారు. NZBలోని రుక్మిణీ ఛాంబర్ (హనుమాన్ జంక్షన్) ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రెండు నెలల క్రితం ఇదే స్టేషన్లో పని చేసిన ఎస్ఐ ఓ కేసు విషయంలో ACBకి చిక్కిన విషయం తెలిసిందే.
Similar News
News October 16, 2025
MBNR: పీయూలో ఘనంగా స్నాతకోత్సవం!

పాలమూరు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ఆడిటోరియంలో 4వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గురువారం మొత్తం 83 బంగారు పతకాలను పీయూ ఛాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పీయూ ఉపకులపతి(VC) ఆచార్య డాక్టర్ జీఎన్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సంవత్సరంలో ఆయా విభాగాల్లో పీహెచ్డీ పూర్తి చేసిన 12 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు.
News October 16, 2025
వనపర్తి: ‘భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి’

మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరు వెంకట్ రాములు డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి, RRR రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
News October 16, 2025
పటాన్ చెరు: పోషకాహారం అందించేందుకే పోషన్ అభియాన్: కలెక్టర్

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకే పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. పటాన్ చెరులో పోషన్ అభియాన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.