News January 29, 2025
ఏసీబీ వలలో లింగంపేట్ ఎస్సై

లింగంపేట్ ఎస్సై సుధాకర్ ఏసీబీకి చిక్కారు. వాహనాల అమ్మకాలు, కొనుగోలు చేసే ఓ వ్యాపారి నుంచి వాహనానికి రూ.12 వేల చొప్పున లంచం ఎస్ఐ లంచం అడిగారు. NZBలోని రుక్మిణీ ఛాంబర్ (హనుమాన్ జంక్షన్) ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం రూ.12,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత రెండు నెలల క్రితం ఇదే స్టేషన్లో పని చేసిన ఎస్ఐ ఓ కేసు విషయంలో ACBకి చిక్కిన విషయం తెలిసిందే.
Similar News
News November 20, 2025
HYD: సందీప్ సూసైడ్కు కారణమైన నిందితుల ARREST

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్ను ఈరోజు జవహర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్తో కలిసి సందీప్ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్తో గొంతు కోసుకుని చనిపోయాడు.
News November 20, 2025
HYD: సందీప్ సూసైడ్కు కారణమైన నిందితుల ARREST

సందీప్ చావుకి కారణమైన బాలరాజు, హరీశ్ను ఈరోజు జవహర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కాప్రా(M) బాలాజీనగర్కు చెందిన బాలరాజు, సందీప్ స్నేహితులు. ఇద్దరు దొంగతనాలు చేస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. వీరిలో సందీప్ తప్పు తెలుసుకుని చెడు స్నేహం మానేశాడు. కోపంతో బాలరాజు మరో మిత్రుడు హరీశ్తో కలిసి సందీప్ను కొట్టగా మనస్తాపం చెందిన అతడు గత రాత్రి బ్లేడ్తో గొంతు కోసుకుని చనిపోయాడు.
News November 20, 2025
రైతులకు అండగా ఉండటం మా బాధ్యత: లోకేశ్

AP: సాగు తీరు మారాలి.. అన్నదాత బతుకు బాగుపడాలన్నదే తమ సంకల్పమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. “ఇవాళ 46.85 లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ కింద 2విడతల్లో కలిపి రూ.14 వేలు చొప్పున జమ చేశాం. అలాగే CM చంద్రబాబు వ్యవసాయాభివృద్ధికి పంచసూత్రాలు ప్రకటించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ సాయం వంటి మార్గదర్శకాలు సూచించారు” అని ట్వీట్ చేశారు.


