News December 25, 2024
ఏసుక్రీస్తు బోధనలు మార్గదర్శకం: మంత్రి లోకేశ్

లోక రక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లలులేని సంతోషాలను బహూకరించే ఉత్సవం క్రిస్మస్ అని ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. క్రీస్తు బోధనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
Similar News
News April 16, 2026
విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 16, 2026
విజయవాడలో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత!

వైద్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాధితుడి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మంగళగిరికి చెందిన సుభాని (31) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు ఇంకా నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము ఇంకా నగదు చెల్లించలేమని హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 16, 2026
GNT: కూలీ కూతురు 990 మార్కులతో ప్రతిభ

గుంటూరు (D) రేవేంద్రపాడు కొత్తపాలెంకు చెందిన పుప్పాల కనకమహాలక్ష్మి పేదరికాన్ని జయించి ఆదర్శంగా నిలిచింది. కూలీ పనులకు వెళ్లే తల్లిదండ్రుల కష్టాన్ని చూసి పట్టుదలతో చదివిన ఆమె, ఇంటర్ బైపీసీలో 990 మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. మల్లె తోటలో కూలీకి వెళ్లే తల్లి, బస్తాలు మోసే తండ్రికి తన విజయంతో తీపి కబురు అందించింది. ఆమె కృషిని గ్రామస్థులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.


