News April 2, 2025
ఐఏబీ నిర్వహించాలని సోమిరెడ్డి లేఖ

ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రెండో పంట కోసం ఐఏబీ సమావేశం నిర్వహించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండీ ఫరూక్, కలెక్టర్ ఆనంద్కు లేఖ రాశారు. ప్రస్తుతం సోమశిలలో 53.374 టీఎంసీలు, కండలేరులో 48.517 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తెలిపారు. రెండో పంటకు నీటి కేటాయింపులకు సంబంధించి ఐఏబీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలన్నారు.
Similar News
News April 7, 2025
కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు

హై కోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. క్వార్జ్ మైనింగ్ కేసులో నమోదైన కేసు నుంచి ముందస్తు బెయిల్ కోరుతూ కాకాణి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న కోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది.
News April 7, 2025
కాకాణికి ఊరట లభించేనా..?

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. ఆయనపై అట్రాసిటీ కేసు కూడా నమోదు కావడంతో బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు విచారణ జరగ్గా నేడు మరోమారు హైకోర్టులో కాకాణి బెయిల్పై వాదనలు జరగనున్నాయి. మరోవైపు కాకాణి ఎక్కడున్నారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
News April 7, 2025
నెల్లూరులో నేటి ధరలు ఇవే..!

నెల్లూరు జిల్లాలో బంగారం, చికెన్, నిమ్మ ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి.
➤ 24 క్యారెట్ల బంగారం(10గ్రా): రూ.91,570
➤ 22 క్యారెట్ల బంగారం(10గ్రా): 83,100
➤కేజీ నిమ్మకాయలు: రూ.110 (పెద్దవి)
➤కేజీ నిమ్మకాయలు: రూ.80 (చిన్నవి)
➤కేజీ నిమ్మ పండ్లు: రూ.50
➤కేజీ బ్రాయిలర్ కోడి: రూ.113
➤కేజీ లేయర్ కోడి: రూ.100
➤కేజీ బ్రాయిలర్ చికెన్: 202
➤కేజీ లేయర్ చికెన్: 170