News March 12, 2025

ఐగాట్ కర్మయోగి కోర్సుల‌ను పూర్తిచేయాలి: కలెక్టర్ 

image

కేంద్రప్ర‌భుత్వ సిబ్బంది వ్య‌వ‌హారాలు, శిక్ష‌ణ శాఖ క‌ర్మ‌యోగి భార‌త్ ద్వారా అందించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేసి, స‌ర్టిఫికెట్లు పొందాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో సీనియ‌ర్ స‌ల‌హాదారు ఎం.వెంక‌టేశ్వ‌ర‌స్వామితో క‌లిసి ఐగాట్ క‌ర్మ‌యోగి కోర్సుల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

Similar News

News November 20, 2025

బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలి: ఎస్పీ

image

బాలుర వసతి గృహాల్లో ఉన్న బాలలకు విద్యాపరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. బాలల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఏలూరు శనివారపుపేటలో ఉన్న బాలుర వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. అక్కడ ఉన్న 51 మంది బాలురకు పలు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం వారికి ఎస్పీ బహుమతులను అందజేశారు. వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు. ఎస్పీ రాకతో బాలురు సంతోషించారు.

News November 20, 2025

HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

image

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిపింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. ఫేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.

News November 20, 2025

తిరుమల: వేగంగా ఫుడ్ ల్యాబ్ పనులు

image

భక్తులకు నాణ్యమైన ఆహారం అందించే దిశగా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.19.84 కోట్లు విడుదల చేసింది. ల్యాబ్ యంత్రాలు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ నెలలో ల్యాబ్ ప్రారంభించేలా పనులు చేస్తున్నారు.