News March 12, 2025

ఐగాట్ కర్మయోగి కోర్సుల‌ను పూర్తిచేయాలి: కలెక్టర్ 

image

కేంద్రప్ర‌భుత్వ సిబ్బంది వ్య‌వ‌హారాలు, శిక్ష‌ణ శాఖ క‌ర్మ‌యోగి భార‌త్ ద్వారా అందించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేసి, స‌ర్టిఫికెట్లు పొందాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో సీనియ‌ర్ స‌ల‌హాదారు ఎం.వెంక‌టేశ్వ‌ర‌స్వామితో క‌లిసి ఐగాట్ క‌ర్మ‌యోగి కోర్సుల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

Similar News

News October 23, 2025

KMM: పాఠాలు చెప్పే సార్లూ.. మీకు కూడా చెప్పాలా?

image

విద్యార్థులకు పాఠాలు బోధించి, వారి అభ్యున్నతి కాంక్షించాల్సిన కొందరు టీచర్లు ఈ మధ్య గాడి తప్పి వరుస సస్పెన్షన్లకు గురవుతున్నారు. ఖమ్మంలో ఓ ఉపాధ్యాయుడు ఓ షాపు యజమానిపై దాడి. కూసుమంచి(M), కొణిజర్ల(M)లో టీచర్లు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తిరుమలాయపాలెం(M)లో ఓ టీచర్ ధర్నాలో పాల్గొన్నారు. విద్యా బుద్ధులు నేర్పే టీచర్లే ఇలా ప్రవర్తిస్తుండటంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News October 23, 2025

మిర్యాలగూడ: డీసీఎంలోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

image

గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి చెందిన ఘటన జనగామ(D) దేవరుప్పుల(M) కామారెడ్డిగూడెం స్టేజ్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన వెంకన్న జనగామలో పత్తి అన్‌లోడ్ చేసి తిరిగి మిర్యాలగూడ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. రాత్రి నుంచి ఉదయం వరకు డీసీఎం ఆన్‌లో ఉండగా స్థానికులకు డౌట్ వచ్చి గమనించడంతో ఈ విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు.

News October 23, 2025

WGL: దారుణంగా పతనమైన పత్తి ధర..!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు దారుణంగా పతనం అవుతున్నాయి. బుధవారం క్వింటా పత్తి ధర రూ.7,010 పలకగా.. నేడు రూ.6,810కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే ధర రూ.200 పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరిగేలా అధికారులు, వ్యాపారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.