News March 12, 2025

ఐగాట్ కర్మయోగి కోర్సుల‌ను పూర్తిచేయాలి: కలెక్టర్ 

image

కేంద్రప్ర‌భుత్వ సిబ్బంది వ్య‌వ‌హారాలు, శిక్ష‌ణ శాఖ క‌ర్మ‌యోగి భార‌త్ ద్వారా అందించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఈనెల 20వ తేదీలోగా పూర్తిచేసి, స‌ర్టిఫికెట్లు పొందాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారులకు సూచించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో సీనియ‌ర్ స‌ల‌హాదారు ఎం.వెంక‌టేశ్వ‌ర‌స్వామితో క‌లిసి ఐగాట్ క‌ర్మ‌యోగి కోర్సుల‌పై వివిధ శాఖ‌ల అధికారుల‌తో కలెక్టర్ వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

Similar News

News March 19, 2025

ప.గో : అమ్మకు చీర కొనడానికి దొంగతనం.. చివరికి

image

ఏలూరు జిల్లా చాట్రాయికి చెందిన సురేందర్ తెలంగాణలో కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంత పోలీసులు మంగళవారం సురేందర్ నేరాలను వివరించారు. 90 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దొంగతనం చేసినట్లు వెల్లడించారు. మొదటిసారి అమ్మకు చీర కొనడానికి రూ.300 దొంగతనం చేశాడన్నారు. అతడి వద్ద రూ. 45 లక్షల సొత్తు రికవరీ చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.

News March 19, 2025

కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

image

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.

News March 19, 2025

ఫోన్ ట్యాపింగ్.. వారిద్దరికీ రెడ్ కార్నర్ నోటీసులు

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయినట్టు అధికారులు ప్రకటించారు. దీనిపై CBI నుంచి రాష్ట్ర సీఐడీకి సమాచారం వచ్చింది. వారిద్దరినీ వీలైనంత త్వరగా మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

error: Content is protected !!