News January 28, 2025
ఐటీసీ ఎన్నికల్లో అనైతిక పొత్తులు

సారపాక ఐటీసీ కర్మాగారంలో ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. TDP, YSRCP అనుబంధ సంస్థలు పొత్తుతో ముందుకెళ్తున్నాయి. నిన్న ఇరుపార్టీల నేతలు కలిసి ర్యాలీ నిర్వహించడం గమనార్హం. అసలు ఇరుపార్టీలు పొత్తు ఉన్న సందర్భాలు ఎక్కడా లేవు. మరోవైపు ఈ అనైతిక పొత్తులు ఎవరి స్వలాభం కోసం? అనే చర్చ కూడా మొదలైంది.
Similar News
News December 17, 2025
GNT: అధికారుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరుకు చెందిన ఓ అర్జీదారుడికి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆరా తీశారు. సమస్య తీరకుండానే పరిష్కారమైనట్లు అధికారులు తప్పుడు నివేదికలు (సెల్ఫీలు) పంపారని తేలింది. సీఎం ఆ అర్జీని ‘రీ-ఓపెన్’ చేయించినా, అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే తప్పుడు సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
News December 17, 2025
అమ్రాబాద్లో ‘కనిష్ఠం’.. 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత

జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండల కేంద్రంలో అత్యల్పంగా 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్నటితో పోలిస్తే చలి స్వల్పంగా తగ్గినప్పటికీ, రాత్రివేళల్లో చలి పులి వణికిస్తూనే ఉంది.
అమ్రాబాద్ 11.9
తోటపల్లి (కల్వకుర్తి) 12.2
కొండారెడ్డిపల్లి (బల్మూరు) 13.3
తెలకపల్లి 13.5
సిర్సనగండ్ల (చారకొండ) 13.9
వెల్దండ 14.0
పదర 14.2
News December 17, 2025
సిరిసిల్ల: పోలింగ్ కేంద్రాన్ని ప్రరిశీలించిన SP

వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ మహేష్ బీ గితే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సిబ్బంది సహకరించాలని SP కోరారు


