News April 25, 2024
ఐదో రోజు మొత్తం 36 మంది నామినేషన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713932707872-normal-WIFI.webp)
2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ఐదో రోజు మంగళవారం పలు రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36 మంది అభ్యర్థులు 44 సెట్లు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఐదుగురు అభ్యర్థులు ఐదు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
Similar News
News January 16, 2025
నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736985374857_52055574-normal-WIFI.webp)
సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.
News January 16, 2025
ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736987315533_52112909-normal-WIFI.webp)
సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
News January 16, 2025
పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాల: జేసీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736948459740_52180182-normal-WIFI.webp)
పక్షుల పండుగకు వచ్చే పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఆదేశించారు. బుధవారం ఆయన నేలపట్టు పక్షుల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ శాఖకు సంబంధించిన అధికారులు ఆ శాఖకు సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని చెరువు కట్టపై వన్ వే కోసం భారీ కేట్స్, వాహనాల రాకపోకలకు రహదారులపై పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.