News October 24, 2024

ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగా వనపర్తి వాసులు

image

భద్రాది కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఐద్వా రాష్ట్ర మహాసభలలో వనపర్తి జిల్లా ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. అధ్యక్ష కార్యదర్శులు సాయిలీల, లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలలో తీసుకున్న కర్తవ్యాలపై, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికైన సాయిలీల, లక్ష్మి లను పలు ప్రజాసంఘాల నాయకులు అభినందించారు.

Similar News

News January 1, 2026

మహబూబ్‌నగర్ ఎస్పీకి ప్రమోషన్

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డి.జానకికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు నుంచే జిల్లా ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహిస్తారు.

News January 1, 2026

పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

image

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు వరించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈనెల 2న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు. #CONGRATULATIONS

News January 1, 2026

MBNR: పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించను: ప్రెసిడెంట్

image

సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం మనందరి అదృష్టమని,పార్టీకి ద్రోహంచేసేవారిని క్షమించబోమని డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ వెల్లడించారు. భూత్పూర్‌లో నూతన సర్పంచుల సన్మాన ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులు, ఇతర సభ్యులు,స్వతంత్ర, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకివచ్చే అందరూ సమిష్టిగాఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవాలని ఆయన కోరారు.