News March 5, 2025
ఐనవోలు: ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు

ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం గత నెల 18 నుంచి ఈనెల 3 వరకు 44 రోజులకు గాను రూ. 42,64,669 వచ్చాయి. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ. 1,35,94,297 ఆదాయం రాగా మొత్తం రూ. 1,78,58,966/- వచ్చాయని ఈవో తెలిపారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి హుండీలో భద్రపరిచామని తెలిపారు. ఇందులో టెంపుల్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వారి సిబ్బంది, ఐలోని కానిస్టేబుల్స్ ఉన్నారు.
Similar News
News November 22, 2025
NGKL: చలికాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

చలి తీవ్రత, పొగ మంచు కారణంగా ఉదయం-రాత్రి వేళల్లో రోడ్లపై విజిబిలిటీ (కనిపించే దూరం) తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ ధరించాలని, హైబీమ్ కాకుండా లోబీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఫోర్ వీలర్ డ్రైవర్లు ఫాగ్ ల్యాంప్స్ లేదా లోబీమ్ లైట్లను వాడాలని సూచించారు.
News November 22, 2025
NGKL: చలికాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

చలి తీవ్రత, పొగ మంచు కారణంగా ఉదయం-రాత్రి వేళల్లో రోడ్లపై విజిబిలిటీ (కనిపించే దూరం) తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ ధరించాలని, హైబీమ్ కాకుండా లోబీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఫోర్ వీలర్ డ్రైవర్లు ఫాగ్ ల్యాంప్స్ లేదా లోబీమ్ లైట్లను వాడాలని సూచించారు.
News November 22, 2025
WNP: ఉచిత చీరల పంపిణీ సంతోషకరం: కలెక్టర్

ప్రతి ఒక్క మహిళకు ఉచిత చీర ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులందరికీ చీరలు పంపిణీ చేస్తామని, సంఘంలో లేనివారిని సైతం చేర్చుకొని ఇస్తామని తెలిపారు. మహిళా సంఘాల కోసం పెబ్బేరులో పెట్రోల్ బంక్, మహిళా సమాఖ్య భవనం త్వరలో పూర్తి కానున్నాయని ఆమె పేర్కొన్నారు.


