News March 5, 2025
ఐనవోలు: ఐలోని మల్లన్న హుండీ లెక్కింపు

ఈరోజు శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ లెక్కింపు జరిగింది. ఆదాయం గత నెల 18 నుంచి ఈనెల 3 వరకు 44 రోజులకు గాను రూ. 42,64,669 వచ్చాయి. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా రూ. 1,35,94,297 ఆదాయం రాగా మొత్తం రూ. 1,78,58,966/- వచ్చాయని ఈవో తెలిపారు. హుండీలో వచ్చిన మిశ్రమ వెండి, బంగారం తిరిగి హుండీలో భద్రపరిచామని తెలిపారు. ఇందులో టెంపుల్ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వారి సిబ్బంది, ఐలోని కానిస్టేబుల్స్ ఉన్నారు.
Similar News
News December 2, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామలో అరుదైన కపాల శాస్త్ర చికిత్స
> శ్రీపతిపల్లి సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు
> నర్మెట్ట: వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
> తీగల తండా సర్పంచ్ గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం
> నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి ఎన్నికల అబ్జర్వర్
> ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి: అదనపు కలెక్టర్
> ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్
News December 2, 2025
పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 2, 2025
తిరుమల: టికెట్ల లింకులు ఓపెన్ కాక అవస్థలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లింక్ ద్వారా టికెట్లు పొందుతుంటారు. మంగళవారం దర్శనానికి సంబంధించి సోమవారం భక్తులకు మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. అయితే అది ఓపెన్ కాకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు. దీంతో ఎంబీసీ వద్ద నేరుగా వెళ్లి టికెట్లు పొందుతున్నారు.


