News January 14, 2025

ఐనవోలు జాతరలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం

image

ఐనవోలు జాతరలో కొత్త ఆర్టీసీ బస్సును వరంగల్ ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భానుకిరణ్ ప్రారంభించారు. జాతరలోని తాత్కాలిక బస్ పాయింట్ వద్ద మంగళవారం హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని బస్సును ప్రారంభించారు. మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం కొమురవెల్లి, వరంగల్‌ కు సుమారు 500 ట్రిప్పుల బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు.

Similar News

News October 30, 2025

WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

image

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.

News October 30, 2025

వరద బాధితులను పరామర్శించిన మంత్రి కొండా

image

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ గురువారం ఎన్‌.ఎన్‌. నగర్‌లోని వరద బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

News October 30, 2025

బాధితులకు అండగా ఉండండి: వరంగల్ కలెక్టర్

image

భారీ వర్షాల ప్రభావంతో జలదిగ్బంధంలో ఉన్న ఎన్‌ఎన్ నగర్ ప్రాంతాన్ని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా స్వయంగా సందర్శించారు. వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను ఆరా తీశారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులను మార్గనిర్దేశం చేస్తూ తక్షణ సహాయం అందించాలని సూచించారు. బాధితులకు అవసరమైన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు అందించాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.