News February 3, 2025

ఐనవోలు: భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో పూజలు

image

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సోమవారం అమ్మవారి ఏకాదశ వార్షికోత్సవం, వసంత పంచమి సందర్భంగా విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి నవకలశస్నపన, పంచామృత, నవరస, సుగంధపరిమళ ద్రవ్యాభిషేకం, చండీహవనం, మహనివేదన, నీరాజన మంత్రపుష్ప తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Similar News

News December 1, 2025

ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

image

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

News December 1, 2025

NRPT: 15 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆదివారం మొత్తం 15 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కోటకొండలో ఇద్దరు, బొమ్మన్‌పాడులో ముగ్గురు, శాసన్‌పల్లి సర్పంచ్ స్థానానికి నలుగురు నామినేషన్లు వేశారు. మిగిలిన అప్పక్‌పల్లి, అంతర్, జాజాపూర్, షేర్‌నపల్లి, సింగారం, తిరుమలాపూర్ పంచాయతీలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు.

News December 1, 2025

కర్నూలు జిల్లా రైతులకు దిత్వా భయం

image

కర్నూలు జిల్లా రైతులను దిత్వా తుఫాను భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.