News March 22, 2025
ఐపీఎల్లో అందరి దృష్టి కాకినాడ కుర్రాడి వైపే

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పండగ ప్రారంభమవుతుంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కుర్రాడు పెన్మత్స సత్యనారాయణరాజు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూడాలి.
Similar News
News November 14, 2025
జూబ్లీ బైపోల్: కౌంటింగ్ హాల్లోకి వీరికి మాత్రమే అనుమతి

యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు అవుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ హాల్కు చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు.
SHARE IT
News November 14, 2025
జూబ్లీ బైపోల్: కౌంటింగ్ హాల్లోకి వీరికి మాత్రమే అనుమతి

యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు అవుతున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ హాల్కు చేరుకున్నారు. అయితే, కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఇతరులకు ప్రవేశం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు.
SHARE IT
News November 14, 2025
కూర్చున్న వ్యక్తి కూర్చున్నట్టే మృతి

బేతంచెర్ల మండలం ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయ కోనేరు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దయ్య కొడుకు మనోహర్(45) అప్పుడప్పుడు ఆలయ కోనేరులో ఈతకొట్టి స్వామివారిని దర్శించుకుని వెళ్తుండేవారు. ఈక్రమంలో గురువారం కోనేరులో ఈత కొడుతుండగా ఆయాసం రావడంతో గట్టుకు వచ్చి కూర్చున్న మనోహర్ కూర్చున్నట్లుగానే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.


