News March 22, 2025
ఐపీఎల్లో అందరి దృష్టి కాకినాడ కుర్రాడి వైపే

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పండగ ప్రారంభమవుతుంది. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కుర్రాడు పెన్మత్స సత్యనారాయణరాజు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. గోదావరి జిల్లాల ప్రజల చూపు ఇప్పుడు అతడిపైనే ఉంది. మొదటిసారి ఐపీఎల్లో ఎలా ఆడతాడని అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. రంజీ పోటీల్లో ఎనిమిది మ్యాచ్లో 17 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మన కాకినాడకు చెందిన కుర్రాడు ఎలా ఆడతాడో వేచి చూడాలి.
Similar News
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
వేములవాడలో అదనంగా 30 కళ్యాణం టికెట్లు జారీ

వేములవాడ పుణ్యక్షేత్రంలో శ్రీ పార్వతి, రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నిత్య ఆర్జిత సేవలలో భాగంగా మంగళవారం ఆలయ అన్నదాన సత్రం పైఅంతస్తులో అర్చకులు, వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కనులపండువగా సాగింది. కళ్యాణం టికెట్ల కోసం భక్తులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మంగళవారం అదనంగా 30 టికెట్లను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
News November 18, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ 7.8, న్యాల్కల్ 8.2, సదాశివపేట 8.4,మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 9.9, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6,పోతారెడ్డిపేట 9.2, కొండపాక 9.7డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు,బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


