News April 6, 2024
ఐపీఎల్ మ్యాచ్లో ఉమ్మడి జిల్లా మంత్రులు

శుక్రవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు సందడి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హీరో వెంకటేష్లతో కలిసి మ్యాచ్ వీక్షించారు. అనంతరం హైదరాబాద్ జట్టు గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News October 22, 2025
KNR: ‘గిరిజన హక్కుల పోరాట వీరుడు కొమురం భీమ్’

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. కొమురం భీమ్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహా వీరుడని కొనియాడారు. “జల్, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనుల ఆస్తి, భూమి, అడవుల మీద హక్కుల కోసం ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారని నేతలు తెలిపారు.
News October 22, 2025
బేడ బుడగ జంగం సమస్యలపై మంత్రికి వినతి

బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేణు, బుధవారం HYDలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. SC వర్గీకరణ నేపథ్యంలో రిజర్వేషన్ల పరంగా ఏ గ్రూపులో ఉన్న ఉద్యోగాలు, పదోన్నతులు ఇతర గ్రూపులకు తరలించకుండా బ్యాక్ లాగ్ పోస్టులుగా ఉంచాలని ఆయన కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో బేడ బుడగ జంగాలకు తగు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వేణు తెలిపారు.
News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.