News February 20, 2025

ఐరాల: రోడ్డు ప్రమాదంలో బాలుడి స్పాట్ డెడ్ 

image

ఐరాల(M) కాణిపాకపట్నం వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై తిరుపతి(D) మంగళంకు చెందిన లక్ష్మయ్య అతని భార్య, కుమారుడు కిరణ్ బైకు మీద తిరుపతి నుంచి పలమనేరు వెళ్తున్న సమయంలో లారీని తప్పించబోయి డివైడర్ ఢీకొట్టారు. ఈ ఘటనలో కిరణ్ (11) అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మయ్య, అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News March 18, 2025

చొప్పదండి: హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపిక

image

చొప్పదండికి చెందిన మంచికట్ల కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కాగా కుమార్ తండ్రి మంచికట్ల విట్టల్.. ఫుట్‌వేర్ షాప్ నడిపిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కుమార్ మాట్లాడుతూ.. తన తండ్రి కష్టపడి చదివించారని, తన ఆశయాలను వమ్ము చేయకుండా కృషి, పట్టుదలతో చదివానని ఈసందర్భంగా పేర్కొన్నాడు. కుమార్‌ను పద్మశాలి సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య, దండే లింగన్న, దూసరాము అభినందించారు.

News March 18, 2025

9 నెలలు అంతరిక్షంలోనే ఎందుకున్నారంటే?

image

గత ఏడాది జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉన్నారు. 8 రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తాయి. ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో SEP 7న వ్యోమగాములు లేకుండానే స్టార్ లైనర్ భూమికి తిరిగి రాగా వారు అక్కడే ఉండిపోయారు.

News March 18, 2025

రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్

image

వైసీపీఅధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌ బుధవారం బాపట్ల జిల్లా మేదరమెట్లలో పర్యటించనున్నారు. ఉదయం 9.30కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు. అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత వైవీ సుబ్బారెడ్డి నివాసానికి చేరుకుని, ఆయన మాతృమూర్తి యర్రం పిచ్చమ్మ (85) పార్దివ దేహానికి నివాళులర్పిస్తారు. వైవీ కుటుంబ సభ్యులను పరామర్శించిన అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.

error: Content is protected !!