News February 1, 2025

ఐర్లాండ్‌లో రొంపిచర్ల వాసి మృతి

image

రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ (26) ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు శుక్రవారం తెలిపారు. సురేష్ ఐర్లాండ్లో ఎమ్మెస్ చదవడానికి సంవత్సరం క్రితం వెళ్ళాడు. స్నేహితులతో కలిసి కారులో ముగ్గురితో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరొకరు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News February 1, 2025

BUDGET 2025-26: కీలకాంశాలు

image

* ఆదాయ పన్ను మినహాయింపు రూ.12 లక్షలకు పెంపు
* అద్దెలపై వార్షిక TDS పరిధి రూ.6 లక్షలు
* స్టార్టప్స్‌ మొదలైననాటి నుంచి 5 ఏళ్ల పాటు ప్రయోజనాలు
* 36 రకాల కీలక ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ రద్దు
* బీమా రంగంలో FDI పరిధి 100శాతానికి పెంపు
* పదేళ్లలో 100 స్థానిక ఎయిర్‌పోర్టుల నిర్మాణం
* వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
* 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు
* కిసాన్ క్రెడిట్ కార్డు రుణం రూ.5 లక్షలకు పెంపు

News February 1, 2025

అప్పుడు.. ఇప్పుడు!

image

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 నుంచి వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆరు సార్లు రెగ్యులర్ బడ్జెట్‌, ఒక మద్యంతర బడ్జెట్‌ను సమర్పించగా నేడు ఎనిమిదో సారి ప్రసంగించారు. ప్రతిసారి సంప్రదాయ చీరకట్టులో ఎరుపు రంగు వస్త్రంలో ఉంచిన కాపీలు/ట్యాబ్‌తో ఆమె పార్లమెంట్‌కు రావడం విశేషం. ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండటంతో ఇండియన్ బడ్జెట్‌ను.. ‘నిర్మలమ్మ బడ్జెట్’ అని ప్రజలు పిలుస్తుంటారు.

News February 1, 2025

ధర్మపురి: ఫుడ్ పాయిజన్ ఘటన.. మాజీ మంత్రి ఫైర్ 

image

ధర్మపురి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్లు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు అయిన పిల్లలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు.