News February 1, 2025

ఐర్లాండ్‌లో రొంపిచర్ల వాసి మృతి

image

రొంపిచర్ల గ్రామానికి చెందిన చెరుకూరి సురేష్ (26) ఐర్లాండ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు శుక్రవారం తెలిపారు. సురేష్ ఐర్లాండ్లో ఎమ్మెస్ చదవడానికి సంవత్సరం క్రితం వెళ్ళాడు. స్నేహితులతో కలిసి కారులో ముగ్గురితో వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సురేష్‌తో పాటు విజయవాడ సమీపంలోని జగ్గయ్యపేట ప్రాంతానికి చెందిన మరొకరు మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News February 14, 2025

MDK: పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి: కలెక్టర్

image

పెండింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలలో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆయా సంబంధించిన వివిధ దశలలో ఉన్న పనులను వాటి పురోగతిని సమీక్షించి సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.

News February 14, 2025

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.

News February 14, 2025

ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

image

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.

error: Content is protected !!