News March 27, 2025
ఐ.పోలవరం: అత్తింటి వేధింపులు..4 నెలల గర్భిణి సూసైడ్

తాళ్లరేవులోని గండివారిపాలెంలో 4 నెలల గర్భిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరంలోని జి. వేమవరానికి చెందిన ప్రవళ్లిక (21)కు తాళ్లరేవుకు చెందిన రాంబాబుతో ఏడాది క్రితం పెళ్లైంది. కొన్ని నెలలుగా అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధిస్తున్నారని యువతి తండ్రి ఆరోపించారు. దీంతో గర్భిణి అయిన తన కుమార్తె ఆత్నహత్య చేసుకుందని విలపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 15, 2025
HYD: నేషనల్ ప్రెస్ డే.. జర్నలిస్టులకు ఆహ్వానం..!

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నవంబర్ 16న నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం జరుగుతుంది. సమాచార, ప్రజాసంబంధాల శాఖ, మీడియా అకాడమీ కలిసి నిర్వహిస్తున్న ఈ వేడుకకు ఉదయం 10:30కి జర్నలిస్టులు హాజరవ్వాలని IPR అధికారులు కోరారు. I&PR ప్రత్యేక కమిషనర్ ముఖ్య అతిథిగా, సీనియర్ ఎడిటర్ దేవులపల్లి అమర్ సహా పలువురు మీడియా ప్రముఖులు పాల్గొంటారు.
News November 15, 2025
దేశమంతా గర్వంగా ఫీలవుతుంది: మహేశ్ బాబు

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. ఇది విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు’ అని గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో మాట్లాడారు.
News November 15, 2025
HYD: హైడ్రాకు హైకోర్టు వార్నింగ్..!

హైకోర్టు HYDలో సరస్సుల పనుల సందర్భంగా కోర్టు ఆదేశాలు ఉల్లంఘించినందుకు HYDRAA, కమిషనర్ ఎ.వి.రఘునాథ్కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని ప్రశ్నించిన జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, సరస్సుల సంరక్షణ పేరుతో యాదృచ్ఛిక చర్యలు అనుచితమని వ్యాఖ్యానించారు. ఖానామెట్లోని తమ్మిడి కుంట ట్యాంక్ సమీపంలో స్టేటస్ క్వో ఆదేశాల ఉల్లంఘనల పై విచారణ జరుగుతోంది.


