News February 28, 2025
ఐ.పోలవరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్డెడ్

ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. ముమ్మిడివరం(M) కర్రివానిరేవుకు చెందిన మట్టా ఆకాష్ రెడ్డి, కొండేపూడి సిద్దార్థ కుమార్ బైక్పై యానాం నుంచి కర్రివానిరేవుకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసులు మృతదేహాలను ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 18, 2025
VJA: వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ

SRR & CVR కళాశాలలో వెబ్ డెవలపర్ కోర్సులో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో వెబ్సైట్ రూపకల్పనపై శిక్షణ ఇస్తామని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు దీనికి హాజరు కావొచ్చన్నారు. వివరాలకై APSSDC ట్రైనింగ్ కో ఆర్డినేషన్ అధికారి నరేశ్ను సంప్రదించాలని కోరారు.
News September 18, 2025
పెద్దపల్లి టాస్క్లో రేపు జాబ్ మేళా

పెద్దపల్లిలోని పాత MPDO కార్యాలయం దగ్గర గల TASK రీజినల్ సెంటర్ లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు TASK ప్రతినిధులు తెలిపారు. టెలి పెర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగం కోసం ఆసక్తి గల నిరుద్యోగులు ఉ. 10గంటల వరకు తమ రెజ్యూమ్ కాపీలు, ఐడీ ప్రూఫ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా తీసుకొని రావలసి ఉంటుందన్నారు. B.Tech/డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 9059506807 సంప్రదించవచ్చు.
News September 18, 2025
VKB: ‘బియ్యాన్ని సమయానికి అందించాలి’

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు అందించే బియ్యాన్ని సమయానికి అందించాలని రైస్ మిల్లర్లకు అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జిల్లాలోని రైస్ మిల్లర్లతో సివిల్ సప్లై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లకు నిర్దేశించిన రైస్ను సకాలంలో అందిస్తే జిల్లాలోని రేషన్ షాపులకు త్వరగా పంపిణీ చేస్తామన్నారు.