News November 5, 2024
ఐ.పోలవరం: విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. టీచర్ అరెస్ట్

ఐ.పోలవరం హైస్కూల్లో విద్యార్థినుల పట్ల మ్యాథ్స్ టీచర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ హాస్టల్ వార్డెన్ చేసిన ఫిర్యాదుపై మంగళవారం SI మల్లికార్జున రెడ్డి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై వార్డెన్ విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఇదే ఆరోపణలపై టీచర్ రెండుసార్లు సస్పెండ్ అయ్యారు.
Similar News
News February 26, 2026
CM మాట ఇచ్చారు.. అధికారులు పని మొదలెట్టారు!

తాళ్లపూడి మండలం మలకపల్లి ప్రజావేదికలో సనమండ్ర పోసియ్యకు ఇచ్చిన హామీని CM చంద్రబాబు నెరవేర్చారు. కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదేశాలతో హౌసింగ్ అధికారులు, MRO గురువారం లబ్ధిదారుడి అసంపూర్తి గృహాన్ని పరిశీలించారు. హౌసింగ్ విభాగం నుంచి ఇంటి నిర్మాణం పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. CM ఆదేశాలతో పనులు వేగవంతం కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 26, 2026
ఫిబ్రవరి 28న బిక్కవోలు జాబ్ మేళా

బిక్కవోలులోని శ్రీ ప్రజ్ఞ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఫిబ్రవరి 28న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పారు. టెన్త్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు.
News February 26, 2026
దేవరపల్లి: తలపై రాయి పడి కార్మికుడు మృతి

దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఓ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో అవిటి యేసు (42) అనే కార్మికుడు మృతి చెందాడు. పనుల్లో ఉండగా ప్రమాదవశాత్తు తలపై రాయి పడటంతో తీవ్ర గాయమైందని స్థానికులు తెలిపారు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


